వరంగల్ : ప్రియుడితో కలిసి అత్తను చంపిన కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగారశిక్ష పడింది. 2012లో కాజీపేట, ప్రశాంత్ నగర్ లో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అత్తను చంపిన కోడలితో పాటు ఆమె ప్రియుడు మరో ఇద్దరికి శిక్ష పడింది. భర్త ఆస్ట్రేలియాలో ఉండగా మిస్ కాల్ తో పరిచయమైన యువకుడితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అత్త అడ్డంగా ఉందని ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడినట్లు తేలిందన్నారు పోలీసులు. దశదిన కర్మ తర్వాత తల్లి ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా కావడంతో అనుమానంతో భార్యను నిలదీసిన భర్తకు అసలు విషయం తెలిసిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm