హైదరాబాద్: గ్రేటర్ వాసులకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు అందించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ కోరారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. గ్రేటర్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పకడ్బందీ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm