హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది నివర్ తుఫాన్. నివర్ రానున్న 2 రోజులు తీవ్ర రూపం దాలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాగల 6 గంటల్లో నివర్ తుపాను...అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు ఏపీ విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. కడలూర్కు తూర్పు ఆగ్నేయం 240 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్లు , చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. రేపు తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm