హైదరాబాద్: ఖైరతాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం డివిజన్ పరిధిలోని న్యూ సీఐబీ క్వార్టర్స్లో పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వరద సాయం అందలేదని విజయారెడ్డిని నిలదీశారు. తన పక్కింట్లో ఉన్న వారికి రూ.10వేలు ఇప్పించి, అసలైన వరద బాధితులకు ఎందుకు ఇవ్వలేదని ఓ మహిళ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో విజయారెడ్డి తండ్రి పీజేఆర్ ముఖం చూసి ఓటు వేశామని.. ఇప్పుడు ఓటు వేసే ప్రసక్తే లేదని మహిళలు తేల్చి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm