హైదరాబాద్ : కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు హరియాణా అంబాల సమీపంలోని శాంభు సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఢిల్లీ వెళ్తున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు బారీకేడ్లను తొలగించి వంతెనపై నుంచి కిందకు విసిరారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm