హైదరాబాద్ : పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. పాక్ జట్టులో ఆరుగురు క్రికెటర్లు కరోనా బారినపడ్డారు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ట్వీట్ చేసింది. ప్రస్తుతం వారంతా క్రైస్ట్చర్చ్లోని ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. టూర్లో భాగంగా డిసెంబరు 10 నుంచి మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి కివీస్-పాక్.
Mon Jan 19, 2015 06:51 pm