హైదరాబాద్ : 26/11 మారణహోమంలో అసువులు బాసిన వారికి ప్రధాని మెడీ శ్రద్ధాంజలి ఘటించారు. మోడీ మాట్లాడుతూ.. ముంబై 26/11 మారణ హోమాన్ని ఎప్పటికి మరిచిపోలేమని అన్నారు. 2008 లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. నేటి భారతం కొత్త పంథాతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న భద్రతా బలగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm