జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు భద్రతాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని నిర్బంధించిన సైన్యం .. దాడికి పాల్పడ్డవారి కోసం గాలిస్తోంది. కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. శ్రీనగర్ హెఎమ్టీ ప్రాంతంలో భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి... ఈనెల 28న కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అలజడి రేపడమే లక్ష్యంగా ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డి ఉంటారని భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm