చెన్నై: బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి డిసెంబర్ 1 2 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుపాన్గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయనున్నారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుపాన్ రూపంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక జిల్లాల్లో జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. ఉబరి నీటి విడుదల సాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm