హైదరాబాద్: గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,69,223కు చేరింది, 1,455 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,490 యాక్టివ్ కేసులుండగా.. 2,57,278 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. ఇప్పటి వరకు తెలంగాణలో 53,32,150 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 131, రంగారెడ్డి జిల్లాలో 58 కరోనా కేసులు నమోదయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm