హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు వారు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబ్నగర్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్కు చెందిన సాయిప్రణీత్ లింగమనేని పరిస్థతి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm