హైదరాబాద్: సోమవారం వర్చువల్ విధానంలో జరుగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్ సీ వో) సదస్సుకు భారత్ తొలిసారి అతిథ్యమిస్తోంది. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2017లో షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యత్వం తర్వాత తొలిసారి భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. ఈ కార్యక్రమంలో రష్యా, చైనా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ప్రధానులు పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm