హైదరాబాద్: విజయవాడ హైవే వాహానాలతో కిక్కిరిసిపోయింది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో నగరవాసుల స్వగ్రామాల బాట పట్టారు. శని, ఆదివారాలతోపాటు సోమవారం కార్తీక పౌర్ణమి, మంగళవారం బల్దియా ఎన్నికల సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవువ వచ్చాయి. దీంతో సెలవు రోజులను స్వగ్రామాల్లో గడిపేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో విజయవాడ, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. విజయవాడవైపు వెళ్లే వాహనాల కారణంగా దిల్సుఖ్నగర్ నుంచి హయత్నగర్ వరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. వరుస సెలవుల కారణంగా పెద్ద ఎత్తున నగరం ఖాళీ అవుతుండడంతో ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm