హైదరాబాద్ : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాదీనం చేసుకున్నారు అధికారులు. ఎనిమిది మంది ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు 3.15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్న వీరిని తనిఖీ చేసిన అధికారులు బంగారం ఉండటాన్ని గుర్తించారు. నిందితులు ఎల్సీడీ మానిటర్, ల్యాప్టాప్, ట్రాలీ బ్యాగ్లలో బంగారాన్ని దాచారు. దీంతోపాటు ఓ ప్రయాణికుడి ప్యాంట్లో బంగారాన్ని గుర్తించారు. దీని మొత్తం విలువ రూ.1.57 కోట్లు ఉంటుందని అంచనా.
Mon Jan 19, 2015 06:51 pm