హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 593 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గడిచిన 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,058 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,816కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,58,336కి మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,458కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,637 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,459 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 119 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm