హైదరాబాద్ : మణిపూర్ రాష్ట్రంలో భారీగా కలప పట్టుబడింది. ఉక్రూల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 కోట్ల విలువైన కలుపను అస్సాం రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తున్న కలపను కోషు గ్రామం శివారులో గుర్తించి పట్టుకున్నారు. ఇంత మొత్తంలో కలపను ఎక్కడికి తరలిస్తున్నది తెలియ రాలేదు. సీజ్ చేసిన వాహనాలను, కలపను పోలీసులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm