హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లు వెళ్లే సమయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి వెళ్లే శాలిమార్ ఎక్స్ప్రెస్ రెండు గంటల ముందే రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరింది. ఉదయం 5:40 గంటలకు వెళ్లాల్సిన శాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు.. తెల్లవారుజామున 3:45గంటలకే బయలుదేరడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా గంట ముందే బయల్దేరి వెళ్లింది. దీంతో రైళ్లు వెళ్లే సమయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైల్వే అధికారులు ఇబ్బంది పెట్టారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm