హైదరాబాద్: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 100మంది చిన్నారులకు ఆర్థికంగా అండగా నిలిచాడు. ఎకాం ఫౌండేషన్ ద్వారా వారి చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును సచిన్ భరించనున్నాడు. ఈ చిన్నారి బాధితులు మహారాష్ట్ర, బెంగాల్, అసోం, కర్ణాటక, తమిళనాడు, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు. ఇటీవల అసోంలోని ముకుంద ఆస్పత్రికి వైద్యపరికరాలను విరాళంగా ఇచ్చాడు సచిన్. దీని ద్వారా 2వేల మంది చిన్నారులకు ప్రయోజనం కలుగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm