హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24గంటలో 46,597 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,70,318కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,461కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 894 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,59,230కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,627 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 7,586 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 55,00,058కి చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm