హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో51,565 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 565 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 925 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,60,155 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,462కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 9,266 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 7,219 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm