హైదరాబాద్: మెట్రో రైల్ ప్రయాణికులకు మెట్రో రైల్ ఎండీ శుభవార్త చెప్పారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుండి రాత్రి 9.30 వరకు మెట్రో రైల్ నడవనున్నట్లు ఎండీ తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు సమయం పొడిగించామన్నారు. అలాగే రేపటి నుంచి భరత్నగర్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతానికి ఉదయం 7.00 నుండి రాత్రి 9.30 వరకు ట్రైన్లను నడుపుతున్నారు. ప్రయాణికుల డిమాండ్ ని బట్టి మొదటి రైలు ప్రతిరోజూ 07:00 గంటలకు బదులుగా 06:30 కు ప్రారంభమవుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm