హైదరాబాద్ : బంగాళాఖాతంలో మలయా ద్వీపకల్పం వద్ద 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ సంచాలకులు నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం(4న) అల్పపీడనం ఏర్పడే అవకాశముందన్నారు. తెలంగాణలో గురు, శుక్రవారాల్లో పగలు పొడివాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. రాత్రిపూట మళ్లీ చలి పెరుగుతోందన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm