హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 35,551 పాజిటివ్ కేసులు నమోదు కాగా 526 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,34,965కి చేరింది, మృతుల సంఖ్య 1,38,648కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 89,73,373 మంది కోలుకున్నారు. 4,22,943 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm