హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగం మరో ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వెళుతున్న కారు నీటి కుంటలో పడి బాలిక మృతి చెందింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. గుత్తి సమీపంలోని చెర్లోపల్లి నుంచి బేతంచర్లకు వెళుతుండగా..ఆర్ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారుణ్య(9), కౌశికులను.. బాబాయి రవికుమార్ బేతంచర్లకు కారులో తీసుకువెళ్తున్నారు. కొత్తపల్లి వద్ద ప్రమాదవశాత్తు.. నీటి కుంటలో కారు పడిపోయింది. కౌశిక్, రవికుమార్ కారులోంచి ప్రాణాలతో బయటపడ్డారు. కారుణ్య కారులోనే మృతి చెందింది. స్థానికులు కారును, బాలికను బయటకు తీశారు. ఈ ప్రమాదంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అములుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm