హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీ, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో లాభాలు హరించుకుపోయాయి. చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 44,633కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,134 వద్ద స్థిరపడింది.
Mon Jan 19, 2015 06:51 pm