హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయత్నగర్, సరూర్ నగర్, విక్టోరియాల్లోని పోలింగ్ కేంద్రాలను సీపీ మహేశ్ భవగత్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని.. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే మాకు సమాచారం అందించాలని సూచించారు. ముందుగా హయత్ నగర్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ తరువాత సరూర్ నగర్, వీఎమ్ఎమ్ హోమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు సిబ్బందికి సూచలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సీపీ వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm