హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఫలితాలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫలితాల వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ '' గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15-20రోజులుగా కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్ కు ప్రతి ఒక్కరికి పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు'' తెలియజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ''టీఆర్ఎస్ నాయకులకు ఓటు వేసి గెలిపించిన వారికి ధన్యవాదాలు. ఫలితాలు ఆశించినంతగా రాలేదు. వచ్చినదాని కంటే 20-25 వస్తాయని ఆశించాం. ఎగ్జిట్ పోల్స్ లో కూడా అలానే వస్తాయని చెప్పాయి. బీఎన్ రెడ్డి 18, మల్కాజ్ గిరి 70, అడిక్ మెట్ లో 200, మూసాపేట్ లో 100 ఓట్లు లాంటి స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. 10-12 స్థానాల్లో ఇలాగే జరిగింది. పార్టీ సమావేశం పెట్టుకుని కూలంకూషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజలు ఏం ఆశిస్తున్నారో చర్చిస్తాం. సింగిల్ అతిపెద్ద పార్టీగా ఫామ్ అవుతాం'' అని కేటీఆర్ ముగించారు.
Mon Jan 19, 2015 06:51 pm