హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సంజయ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీలను సంజయ్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm