గుంటూరు: వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే ఓసారి కొవిడ్ బారిన పడిన తనకు మరోసారి ఈ వైరస్ సోకినట్టు ఆయన ట్విటర్లో ప్రకటించారు. రీ ఇన్ఫెక్షన్కు గురికావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘‘జులైలో నాకు కొవిడ్ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విదితమే. నిన్న అసెంబ్లీలో కొవిడ్ టెస్ట్ చేయించాను. పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. రీ ఇన్ఫెక్షన్కు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో మరోసారి కరోనాను జయించి మీ ముందుకు వస్తా’’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm