హైదరాబాద్ : మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు 'పంజా' వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రం టీజర్ ను సంక్రాంతి కానుకగా నేడు విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
Mon Jan 19, 2015 06:51 pm