హైదరాబాద్:సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లింగంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దంపతుల మధ్య చెలరేగిన వివాదం గొడవకు దారితీసింది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఉన్న భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఆమెను రక్షించబోయిన భర్తకు మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా దంపతులు మృతి చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm