నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర, జిల్లా స్థాయి ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి భిక్నూర్ మండల విద్యార్థి విభాగం కన్వీనర్ గా కుంట మనీష్ ని నియమిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ రామ్ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని కుంట మనీష్ కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లడుతు తెలంగాణ జాగృతి బలోపేతానికి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కృషి చేయాలని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లో విస్తృతస్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు. కవితక్క ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి, సాయిరాం, విశాల్, రిత్విక్ రెడ్డి, రంజిత్, మురళి, శరత్,అంకుష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2021 04:23PM