కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాల్టీ పరిధి దేవునిపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు పతంగులు ఎగరవేస్తూ ఆడుకుంటున్న నిశాంత్(05) మురుగు కాలువలో పడి మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం పతంగి ఎగురవేయడానికి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు... శుక్రవారం తెల్లవారుజామున మురుగుకాలువలో విగతజీవిగా కనిపించాడు. బాలుడి మృతిపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm