నల్గొండ: నల్గొండ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్త సాయి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దుండగులు యవకుడ్ని బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm