హైదరాబాద్: సికింద్రాబాద్ నేమిచంద్ జైన్ జ్యువెలరీలో భారీ దొంగతనం జరిగింది. అనిల్ జైన్ అనే వ్యాపారి మార్కెట్ పీఎస్ పరిధిలో నేమిచంద్ జైన్ జ్యువెలరీ నిర్వహిస్తున్నారు. దుకాణం వెంటిలేటర్ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగుడు.. దాదాపు 1.20 కిలోల బంగారం ఎత్తుకెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన షాప్కు వచ్చి చూడగా.. ఆభరణాలు, సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించిన వ్యాపారి అనిల్ మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm