బెంగళూరు: వారాంతా చిన్నానాటి స్నేహితులు.. బడి అల్లరి మరోసారి గుర్తుచేసుకుంటూ తమ జ్ఞాపకాలతో గడపాలని 20ఏండ్ల క్రితం విడిపోయిన వారంతా కలిసి విహారయాత్రకు బయలుదేరారు. మినీ బస్సు కేరింతలతో అర్ధరాత్రి విహారయాత్ర ప్రారంభమైనా అందరూ కబుర్లలో మునిగిపోయారు. ఊసులూ బాసలను నెమరువేసుకుంటున్నారు. మరికొద్ది సమయంలో మరొక స్నేహితురాలి నివాసంలో అల్పాహారానికి దిగాల్సి ఉండగా.. ఇంతలో పెనువిషాదం.. ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరి బస్సును బలంగా ఢీకొంది. ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అందరూ రక్తసిక్తమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మరో ఏడుగురు చనిపోయారు.
బాల్య స్నేహితురాళ్లు 16మంది, 16ఏళ్ల ఒక అమ్మాయి గోవా యాత్రకు వెళ్తుండగా శుక్రవారం ఉదయం కర్ణాటకలోని ధార్వాడ నగర శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది కన్నుమూశారు. మృతుల్లో టిప్పర్ డ్రైవరు కూడా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరి టెంపో ట్రావెలర్ ఢీకొంది. ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన మినీ బస్సును టిప్పర్ అత్యంత వేగంగా ఢీకొంది. మృతులంతా దాదాపు 35నుంచి 38 వయసు మధ్యనున్న వీరంతా దావణగెరె నగర పరిధి విద్యానగరకు చెందిన ఎంసీసీ బ్లాక్ నివాసులని గుర్తించారు. మృతులను పూర్ణిమా, ప్రవీణ, ఆశా, మానసి, పరంజ్యోతి, రాజేశ్వరి, శకుంతల, ఉషా, వేదా, నిర్మల, మంజుల, రజని, ప్రీతిగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని ధార్వాడ నగర ఆసుపత్రికి తరలించారు. మృతులు దావణగెరె నగరంలోని సెయింట్పాల్ పాఠశాలకు చెందిన ఒకప్పటి విద్యార్థులు. సంక్రాంతి సందర్భంగా గురువారం అర్ధరాత్రి దావణగెరె నుంచి గోవా యాత్రకు బయలుదేరారు. తెల్లవారుజామున ధార్వాడకు సమీపంలోని ఇడగట్టి వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ రూపంలో మృత్యువు వారిని కబళించింది. గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులకు అందిన సమాచారం ప్రకారం.. బాల్య స్నేహితురాళ్లు కొంతకాలంగా చిట్టీలు వేసుకున్నారు. అలా సమకూర్చుకున్న ఆదాయంతో సంక్రాంతినాడు గోవా యాత్రకు బయలుదేరారు. ఈ సమయంలోనే అంతులేని విషాదం అలుముకుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 12:05PM