హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై... తొలి రోజు ముగిసేనాటికి 1,91,181 మందికి కరోనా టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియలో 16,755 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 3,351 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిపినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మొదటి వ్యాక్సిన్ డోసు తీసుకున్న తర్వాత ఒక్కరు కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరలేదని పేర్కొంది.
నాయకులు టీకా డోసు ఎందుకు తీసుకోవడం లేదంటూ వస్తోన్న విమర్శలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. టీకా తీసుకోవడానికి తమ వంతు వచ్చేదాకా వేచి చూడాలని అన్నారు. 50 ఏళ్లు పైబడినవారికి టీకా ఇవ్వడం ప్రారంభించాక అప్పుడు నేనూ టీకా తీసుకుంటా అని ఆరోగ్య మంత్రి అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంపై వస్తోన్న వదంతులను నమ్మరాదని పేర్కొన్నారు. ప్రముఖ డాక్టర్లు సైతం టీకా డోసు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2021 08:28PM