హైదరాబాద్ : మలబార్ ఎక్స్ప్రెస్ రైలు పార్శిల్ వ్యాన్లో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో వెంటనే అప్రమత్తమై ప్రయాణికులందరినీ రైలు నుండి దింపి వేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంగళూరు-తిరువనంతపురం మధ్య వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఈ మంటలు చోటుచేసుకున్నారు. వివరాల ప్రకారం.. వర్కోలా, పరపూర్ స్టేషన్ల మధ్య ఎడావ వద్ద ఉదయం 7.40 గంటల సమయంలో లోకో పైలట్ రైలు ముందు భాగంలోని పార్శిల్ వ్యాన్లో నుంచి పొగరావడం గుర్తించారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. మంటలు పార్సెల్ వ్యాన్కు పరిమితం కాగా, మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm