హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన పాలేటి రాము(32) తన పొలం వద్ద విద్యుత్ సరఫరా రాకపోవడంతో కొట్టే గోపి(23)ని సహాయం కోసం తీసుకెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద సరఫరా నిలిపివేసి తీగలను తనిఖీ చేస్తుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక లైన్మెన్ నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆ ఇద్దరు యువకులు మరమ్మతులకు వెళ్లి మృత్యువాత పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm