హైదరాబాద్: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించనున్నారు. ఉదయం 9 గంటలకు రసుల్పుర నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు నిర్వహించనున్న అమరజ్యోతి ర్యాలీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి సుహాసిని పాల్గొననున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించనుంది. మంగళగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm