హైదరాబాద్ : దేశంలో పెట్రో ధరల బాదుడు కొనసాగుతున్నది. రికార్డు స్థాయికి ధరలు పెరిగాయి. ఈరోజు కూడా పెట్రో ధరలను పెంచాయి ఆయిల్ సంస్థలు. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోగా.. వారం రోజుల వ్యవధిలోనే పెట్రో ధరలు 75 పైసలు పెరిగిపోయాయి.. తాజా వడ్డింపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.95కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.75.13కు చేరాయి. ఇక, ఈ పెంపుతో దేశంలో గరిష్టస్థాయిని తాకాయి పెట్రో ధరలు.. దేశంలోనే అత్యధికంగా జైపూర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.43కి చేరింది.. డీజిల్ ధర అత్యధికంగా భువనేశ్వర్లో రూ.81.90కు పెరిగింది. ఇవాళ చమురు ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.84.95, లీటర్ డీజిల్ రూ.75.13 కాగా.. జైపూర్లో పెట్రోల్ రూ.92.43, డీజిల్ రూ.84.46, హైదరాబాద్లో పెట్రోల్ రూ.88.37, డీజిల్ రూ.81.99, కోల్కతాలో పెట్రోల్ రూ.86.39, డీజిల్ రూ.78.72, ముంబైలో పెట్రోల్ రూ.91.56, డీజిల్ రూ.81.87, చెన్నైలో పెట్రోల్ రూ.87.64, డీజిల్ రూ.80.44, బెంగళూరులో పెట్రోల్ రూ.87.82, డీజిల్ రూ.79.67, భువనేశ్వర్లో పెట్రోల్ రూ.85.66, డీజిల్ రూ.81.90గా ఉన్నాయి. అయితే, పెట్రో మంట.. నిత్యావసరాలపై కూడా క్రమంగా పడుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm