హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాసంస్థలు, గురుకులాలు, వసతిగృహాలు తెరవడంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు చర్చించారు. తొమ్మిదో తరగతి ఆపై కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని సమావేశం అనంతరం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఈనెల 25 వరకు పాఠశాలలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరుశాతం తప్పనిసరికాదని... మధ్యాహ్న భోజనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుంటే విడతలవారీగా ఇతర తరగతులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పుస్తకాలు, యూనిఫారాలు ఇప్పటికే పాఠశాలలకు చేర్చామన్నారు. రేపటి సమావేశానికి తల్లిదండ్రుల కమిటీని ఆహ్వానించామని తెలిపారు.
ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమంపై ఎటువంటి అలసత్వం వహించమన్నారు. అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కరోనా ఎఫెక్ట్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ట్రైబల్ వెల్ఫేర్ పరంగా 90 వేల మంది విద్యార్థులు పాఠశాలకు హాజరు కాబోతున్నారని అన్నారు. హాస్టళ్లలో పారిశుధ్యం కోసం ఇప్పటికే బడ్జెట్ కేటాయించినట్టు పేర్కొన్నారు. త్రాగునీరు ఏర్పాటు, పారిశుధ్యం తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీ పాఠశాలలను పరిశీలిస్తోందని అన్నారు. కరోనా ప్రబలకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు హాస్టళ్లలో ఉన్నాయని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2021 03:47PM