హైదరాబాద్ : వంట గ్యాస్ లీకై ఓ గుడిసెలో నిర్వహిస్తోన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్లో మంటలు చెలరేగిన ఘటన మేడ్చల్ జిల్లాలోని సుచిత్ర చౌరస్తా జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ గుడిసె మాత్రం దగ్ధమైంది. జిల్లాలోని సుచిత్రా చౌరస్తా ప్రాంతంలోని ఓ గుడిసెలో కొంత కాలంగా ఫాస్ట్ఫుడ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. అల్పాహారం తయారు చేసే క్రమంలో గ్యాస్ వెలిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
Mon Jan 19, 2015 06:51 pm