హైదరాబాద్ : ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 139 పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి. 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 20, గుంటూరు జిల్లాలో 17 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 3, కడప జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 5 కేసులు గుర్తించారు. అదే సమయంలో 254 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm