హైదరాబాద్ : కర్ణాటకలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి శివమొగ్గలోని అబ్బలగిరె గ్రామ సమీపంలో ఈ పేలుడు సంభవించడంతో 10 మందికి పైగా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్వారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే.. శివమొగ్గ జిల్లా, చిక్మంగళూరు జిల్లాలోనూ రాత్రి 10:30 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. క్వారీ పేలుడు పదార్థాలు తరలిస్తున్న లారీలో పేలుడు సంభవించిన తర్వాతే భూప్రకంపనలు చోటు చేసుకుని ఉండొచ్చని స్థానికులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm