కాకినాడ: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్తో మంటలు అంటుకొని బోటు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm