న్యూఢిల్లీ: ఫేస్బుక్ యాజమాన్యంలోని ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్లో కొత్త నిబంధనలు, గోప్యతా విధానాల మార్పుల ఆందోళనల నేపథ్యంలో మరో మెసేజింగ్ యాప్ సిగ్నల్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దేశీయంగా వాట్సాప్కు ప్రత్యర్థిగా దూసుకొస్తున్న సిగ్నల్ వినియోగదారులను తనవైపు తిప్పుకునేందుకు వాట్సాప్ తరహాలో ఈ ఫీచర్లను తన యూజర్ల సౌలభ్యం కోసం విడుదల చేసింది. తాము ఎలాంటి యూజర్ డేటాను సేకరించమని ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిర్భయంగా వాడుకోవచ్చని సిగ్నల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రియాన్ ఆక్టన్ ప్రకటించారు. ఇంత తక్కువ వ్యవధిలో తమకు లభించిన ఆదరణ దీనికి నిదర్శమన్నారు. సిగ్నల్ యూజర్లు ప్రతీ ఒక్కరి భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. కాగా వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో కోట్లాదిమంది వినియోగదారులు వాట్సాప్పై గుర్రుగా ఉన్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయాలపై దృష్టి మళ్లిస్తున్నారు. దీంతో టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ, తాజాగా వీటికి మైగ్రేట్ అవుతున్న క్రమంగా పెరుగుతోంది. వినియోగదారుల డేటాకుఎలాంటి ఢోకా లేదు అని వాట్సాప్ హామీ ఇచ్చినప్పటికీ ఈ పరంపరం కొనసాగుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుక సిగ్నల్ శరవేగంగా పావులు కదుపుతోంది. వాట్సాప్ పోలీన ఫీచర్లతో దూసుకొస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm