హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్షకు దిగిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ఐక్యవేదిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగుల నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈపీఆర్సీని ప్రకటించాలంటూ ఒక్కరోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన ఐక్య వేదిక నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm