హైదరాబాద్: మహారాష్ట్రలో పలుచోట్ల బర్డ్ఫ్లూ కేసులు కలకలం రేపుతున్న తరుణంలోనే మరో ఐదు నెమళ్లు సహా ఆరు పక్షులు మృత్యువాత పడ్డాయి. రాష్ట్రంలోని బీద్ జిల్లా లోనీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ప్రాంతం శిరూర్ కేసర్ తాలూకా బాలాఘాట్ పర్వత శ్రేణులను ఆనుకుని ఉంటుంది. చనిపోయిన పక్షుల నమూనాలను పరీక్షల కోసం పంపినట్టు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ విజయ్ దేశ్ముఖ్ పేర్కొన్నారు. తదుపరి చర్యల కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు ఆయన తెలిపారు. కాగా శిరూర్కేసర్ తాలూకాలో ఈ నెల 12 నుంచి ఇప్పటి వరకు 21 కాకులు చనిపోయినట్టు గుర్తించామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm