#WATCH Uttarakhand: A scuffle breaks out between farmers and Police as the latter try to stop them from marching to Raj Bhavan in Dehradun, in protest against #FarmLaws. Visuals from Haridwar - Dehradun Road in Lachhiwala. pic.twitter.com/DSN7iEP4kz
— ANI (@ANI) January 23, 2021
హైదరాబాద్ : సాగు చట్టాల రద్దు పోరాటంలో భాగంగా.. గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి బయలుదేరిన ఉత్తరాఖండ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు - పోలీసులకు మధ్య వివాదం ఏర్పడింది. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి ట్రాక్టర్పై వెళ్తోన్న రైతులను లచ్చివాలా ప్రాంతంలోని హరిద్వార్-డెహ్రాడూన్ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. జనవరి 26న ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ఇటీవలే ప్రకటించాయి. ఈ ర్యాలీ వల్ల గణతంత్ర వేడుకలకు ఇబ్బంది కలగదని స్పష్టం చేశాయి.